అధికారి లేకపోవడంతో సిబ్బంది చేతివాటమా!!!







 సీజన్ లో చెక్ పోస్ట్ కాళీ!!!

సిబ్బంది లేక వెలవెల పోతున్న చెక్ పోస్ట్!!

టేకులపల్లి ,అక్షిత మీడియా;-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కు సంబంధించినటువంటి చెక్ పోస్ట్ లో సిబ్బంది లేక వేలవేల బోతున్న పరిస్థితి, అధికారుల నిర్లక్ష్యమా లేక చేత వాటమా!! తెలవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మొక్కజొన్న సీజన్ సమవిస్తున్న తరుణంలో చెక్ పోస్ట్ ల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా మాకేందిలే అన్న విధంగా అధికారులు సిబ్బంది వారి పనితనం కనిపిస్తుంది ప్రధానంగా ఇల్లందు కొత్తగూడెం మధ్యలో కలిగినటువంటి బొమ్మనపల్లి చెక్పోస్ట్ వద్ద సిబ్బంది లేకపోవడంతో యదేచ్చగా దళారులు వారి చేతివాటం ద్వారా రైతుల నడిచి తక్కువ ధరకే కొనుగోలు చేసినటువంటి మొక్కజొన్న ను తరలించకపోతున్న పరిస్థితులు అనేకం కనిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా అధికారులు దళారులతో కుంభకై చెక్పోస్టుల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేయకుండా మా జేబులు నిండే మాకేందిలే అన్న విధంగా చెక్పోస్టులను ఖాళీ చేసి వారు మాత్రం వారి సొంత పనులను చూసుకుంటున్నట్టు కూడా సర్వత్ర విమర్శలు వినిపిస్తున్న తరుణంలో దీనిపై ఉన్నత స్థాయి అధికారులు సమగ్ర విచారణ జరిపి దీనికి కారణమైనటువంటి సిబ్బంది, అధికారుల చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న రైతులు మరిన్ని ముఖ్యమైన సమాచారంతో మరొక కథనంతో మీ ముందుకు వస్తాం!!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు