*ప్రైవేట్ స్కూల్స్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సిఎం రేవంత్..*
*హైద్రాబాద్, అక్షిత మీడియా:-
*తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ స్కూల్స్ కి షాక్ ఇచ్చారు.అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలకు సిద్ధమైనట్టు ప్రకటించారు.ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజులపై తల్లిదండ్రులు,విద్యార్థి సంఘాల ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి, కీలక ఆదేశాలిచ్చారు.నిబంధనలు ఉల్లంఘించి ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించారు.అధిక మొత్తాల రికవరీ తప్పదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.*

0 కామెంట్లు