కల్వకుంట్ల కవితకి సిబిఐ షాక్

 


కల్వకుంట్ల కవితకు సీబీఐ బిగ్ షాక్

హైదరాబాద్, అక్షిత మీడియా;-

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించిన కొద్ది గంటల్లోనే సీబీఐ షాక్ ఇచ్చింది. నిందితులందరినీ విడుదల చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మద్యం విధానం రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, కవిత పాత్రపై కీలక ఆధారాలు ఉన్నాయని సీబీఐ వాదిస్తోంది. ఈ అప్పీల్తో కవితకు మళ్లీ చిక్కులు మొదలయ్యే అవకాశం ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు