*ప్రోటో కాల్ మరచిన ఐటీసీ* *అధికారులు*
బూర్గంపాడు ,అక్షిత మీడియా;-
నాగినేని ప్రోలు గ్రామ పంచాయతి అభివృద్ధి పనుల విషయం లో ప్రోటో కాల్ పాటించని ఐటీసీ అధికారులు,గ్రామ అభివృద్ధి కొరకు ఐటీసీ అధికారులు చర్చల జరిపి 50లక్షలు రూపాయలు తో సైడ్ డ్రైనేజీ పనులు సీ ఎస్ ఆర్ నిధులు తీసుకు వస్తే, కేవలం బి ఆర్ఎస్ సర్పంచ్ అనే ఉద్దేశం తో శంకుస్థాపన కు గ్రామ పంచాయతి పాలక మండలి సభ్యులు ను ఆహ్వానించక పోవటం,అధికార పార్టీ నాయకులు, స్థానిక శాసనసభ్యులు కనీసం ప్రోటోకాలు పాటించక పోవటం వారి యొక్క విజ్ఞతకె వదిలేస్తున్నాం అని బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపి రెడ్డి రమణ రెడ్డి అన్నారు, బి ఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఐటీసీ నుండీ నిధులు తీసుకు వస్తే, అట్టి పాలక వర్గాన్ని పిలవకుండా శంకుస్థాపన చెయ్యడాన్ని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఖండిస్తూ, ఐటీసీ అధికారులు గుర్తు పెట్టుకోవాలి ఏ పార్టీ అధికారం లో ఉన్న ఐటీసీ అధికారులు మాత్రం ప్రోటో కాలు విషయం లో అందరిని ఒకే విదంగా చూడాలని అన్నారు, ఇక ముందైనా ఈ విధంగా జరుగకుండా చూడాలని
ఐ టి సి అధికారులకి తేలియజేస్తున్నాము.

0 కామెంట్లు