*కాంగ్రెస్ రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి*
జగిత్యాల ,అక్షిత మీడియా;-
*కార్యకర్తల సమక్షంలో ప్రకటన* పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని చెప్పినా వినిపించుకోలేదు, జగిత్యాలలో ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవద్దని చెప్పినా వినలేదు.నేను, నా కార్యకర్తలు అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నాము.తీవ్రమైన బాధతో పార్టీని వీడుతున్నాను..సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలతో ఆయన సొంత పార్లమెంట్ మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.చేవెళ్ల ఎంపీ స్థానానికి తొలుత సునీతా మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి రంజిత్ రెడ్డిని తెచ్చి అతనికి ఇచ్చారు.దాని ప్రభావం సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ స్థానం మహబూబ్ నగర్ అలానే చేవెళ్ల, సికింద్రాబాద్ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది..

0 కామెంట్లు