బూర్గంపాడు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎస్పీ సతీష్ కుమార్...
బూర్గంపాడు, అక్షిత మీడియా;-పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి: అధికారులకు ఆదేశం...నూతన డీజీపీ సూచనలతో శాంతిభద్రతలకు కఠిన చర్యలు...బూర్గంపాడు ఎస్ఐ మేడ ప్రసాద్...భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్ స్టేషన్ను పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, గురువారం ఆకస్మికంగా సందర్శించి స్టేషన్ పనితీరును సమీక్షించారు. స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పురస్కరించుకొని బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. స్టేషన్ పరిధిలోని రికార్డులు, స్టేషన్లో గల క్రైమ్ కు సంబంధించిన వెహికల్స్ పరిశీలించారు.సిబ్బందితో మాట్లాడుతూ,పెండింగ్ కేసులు,దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అన్ని కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలి.రికార్డుల నిర్వహణ,స్టేషన్లోని అన్ని రికార్డులను నిబంధనల ప్రకారం పక్కాగా నిర్వహించాలి.శాంతిభద్రతలు,నూతన డీజీపీ సూచనలను తూ.చ. తప్పకుండా పాటించి శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలి.స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదగా వ్యవహరించి,వారిసమస్యలువెంటనేపరిష్కరించాలి.అనంతరం డీఎస్పీ స్టేషన్ ఆవరణ, లాకప్ రూమ్, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచాలని సూచించారు...




0 కామెంట్లు