సంతాపసభను జయప్రదం చేయాలని కరపత్రాలు ఆవిష్కరణ
కొమరయ్య శివకుమారి మొహమ్మద్ రఫీ సంతాప సభను జయప్రదం చేయండి
టి యు సి ఐ
ఇల్లందు, అక్షిత మీడియా;-
ఇల్లందు మున్సిపల్ కార్మికులు ఇటీవల మరణించిన కొమరయ్య శివకుమారి రఫీ సంతాపసభ, 28-2- 26 న సంజయ్ నగర్ లో జరుగుతుందన్నారు. ఈ సభ కోసం ముద్రించిన కరపత్రాలను మున్సిపల్ కార్మికుల మస్టర్ అడ్డాల వద్ద ఈరోజు ఆవిష్కరించటం జరిగింది, ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, ఇల్లందు ఏరియా అధ్యక్ష కార్యదర్శి, పాయం వెంకన్న మల్లెల వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ చనిపోయిన కార్మికులు యూనియన్ బలోపేతం కోసం ఎనలేని కృషి చేశారన్నారు.
పిఎఫ్ ఈఎస్ఐ ఏర్పాటు కోసం యూనియన్ ఇచ్చిన పిలుపులో చాలా చురుకుగా పాల్గొని అందర్నీ కదిలించారని వారి సందర్భంగా గుర్తు చేశారు.
వారు చనిపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ కార్మికుల సంతాప సభ శనివారం ఉదయం 11 గంటలకు సంజయ్ నగర్ సమ్మక్క గద్దెల వద్ద జరుగుతుందని ఈ సభను జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి వేముల గురునాథం, అంజద్ మొఖదం దుర్గా, రమణ అరుణ సురేష్ నాంచారి రమేష్ నాయని కృష్ణ వెంకన్న, కుమార్, మహేష్, సదా బాలాజీ భారతి సంధ్య
రాజేష్ రాజమ్మ రవి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు








0 కామెంట్లు