మాజి జిల్లా పరిషత్ చైర్మన్ గోనెల విజయలక్ష్మి గుండెపోటుతో మృతి

 


మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గోనెల విజయలక్ష్మి గుండెపోటుతో మృతి

ఖమ్మం ,అక్షిత మీడియా;-

కొద్దిసేపటి క్రితం ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గోనెల. విజయలక్ష్మి అనారోగ్య తో పాల్వంచలో మృతి చెందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందినటువంటి గోనెల విజయలక్ష్మి.


2006సం!! టేకులపల్లి మండల జడ్పిటిసి గా గెలుపొంది అప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం అన్న విధంగా పోటాపోటీగా నడిచిన పరిస్థితుల్లో రెండు పార్టీలకి సమానంగా రావడంతోనే అప్పుడు టాస్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా గెలుపొందడం జరిగింది. 1980 నుంచి 1990 వరకు కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడిగా పని చేసినటువంటి గోనెల వెంకట్ నారాయణ సతీమణిగా 1991లో గోనెల నారాయణ హత్యతో రాజకీయరంగేట్రం చేసినటువంటి గోనెల విజయలక్ష్మి ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా చేయడం జరిగింది

.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు