కార్ల్ మార్క్స్ ఆశయాలు చిరస్మరణీయం

 


మార్క్స్ ఆశయాలు చిరస్మరణీయం

సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు 

సంగారెడ్డి , అక్షిత మీడియా;-

ప్రపంచ గమనాన్ని మార్చిన మహోన్నత తత్త్వవేత్త,మేధావి, శ్రామిక వర్గ సిద్ధాంత కర్త కారల్ మార్క్స్ అని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు కొనియాడారు.నేడు సిపిఎం ఆధ్వర్యంలో సంగారెడ్డి కేకే భవన్ లో జరిగిన మార్క్స్ 143వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. 'దాస్ క్యాపిటల్', 'కమ్యూనిస్టు మేనిఫెస్టో' గ్రంథాలు కార్మిక వర్గానికి అసలైన ఆయుధాలని అన్నారు.ఆయన రాసిన సిద్ధాంతం నేటికీ శ్రమజీవులకు స్ఫూర్తిదాయకమని ఉద్ఘాటించారు. మార్క్స్ ఆశయ సాధనే లక్ష్యంగా పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం సిపియం నాయకులు మాణిక్, కృష్ణ, సతీష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview