పాండురంగ పురం శిథిల వస్థకు చేరిన పశు వైద్యశాల భవనం పట్టించుకోండి మహాప్రభో
పాల్వంచ, అక్షిత మీడియా;-పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామపంచాయతీలో పశువుల ఆసుపత్రి శిథిల వ్యవస్థకు చేరి కొన్ని సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వ జిల్లా ఉన్నత అధికారులు మండల అధికారులు వైఫల్యం చెందినట్లు సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గూగులొత్ బద్రు నాయక్ అధికారులకు డిమాండ్ చేశారు. పాండురంగాపురం గ్రామంలో పశు వైద్యశాలకు పశువులకు తోలక వచ్చిన రైతులు లోపలికి వెళ్లాలంటే భయపడుతున్నారు శిథిలావస్థకు చేరుకున్న పశు వైద్యశాలను తొలగించి నూతన పశు వైద్యశాల భవనాన్ని నిర్మించాలని జిల్లా అధ్యక్షులు గూగులొత్ బద్రు నాయక్ అధికారులకు అధికారులను కోరారు
నూతన భవనం నిర్మించి పశు వైద్యశాలలో మూగజీవాలకు వైద్య సేవలు చేయాలని పలుమార్లు మండల అధికారులకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించిన వినతి పత్రాలు అధికారులు నుండి స్పందన కరువైంది. శిథిలావస్థకు ఉన్న పశువు వైద్యశాలను పరిశీలించి నూతన పశువైద్యశాలను ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు. జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి స్థితి లా వస్తాలో ఉన్న పశు వైద్యశాల భవనానికి తొలగించకుండా వైద్యం సేవలు నిర్వహిస్తే ప్రమాదం సంభవించే ఆకాశముందని తమ గ్రామంలో నూతన పశు వైద్యశాల తక్షణమే నిర్మించాలని జిల్లా అధికారులను కోరారు

0 కామెంట్లు