లారీ లో తరలిస్తున్న 8,00,000 విలువైన 70 క్వింటల్ల నల్లబెల్లం, 10 క్వింటాల్ పట్టిక స్వాధీనం.
ముగ్గురి అరెస్ట్, లారీ సీజ్.
మహబూబాబాద్, అక్షిత మీడియా;-
మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్ కురవి పోలీస్ సంయుక్త ఆపరేషన్ లో అక్రమ సారాయి వ్యాపారం గురించి చిత్తూరు నుండి మహబూబాబాద్ కి నల్లబెల్లం తరలిస్తున్న లారీ నీ కురవి శివారు సోమ్లా తండా దగ్గర పట్టుకొని అందులో తరలిస్తున్న 70క్వింటాల్ నల్లబెల్లం,10 క్వింటల్ పట్టిక స్వాధీనం చేసుకొని బాద్యులైన గుగులోత్ సుమన్ తండ్రి దామ్య మహబూబాబాద్, ఆరెపల్లి మధు బొల్లా విజయ్ కుమార్ అనే వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో టాస్క్ఫోర్స్ సి ఐ హతీరామ్, ఎస్ ఐ లు తాహేర్ బాబా, కురవి గండ్రాతి సతీష్, జయకుమార్, పి సి లు,సమ్మయ్య, హరిబాబు, నరేష్, బద్రు, బాబు పాల్గొన్నారు.

0 కామెంట్లు