ప్రమాదంలో ఒకరు మరణిస్తే వారి కుటుంబమే చాలా చదిరవుతుంది. మంత్రి పొంగులేటి



 ఒకప్రమాదంలో వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం చెల్లాచెదురవుతుంది.మంత్రి పొంగులేటి 

ములుగు, అక్షిత మీడియా;-

వేగం కన్నా ప్రాణం చాలా విలువైంది. వాహనదారులు చేసే పొరపాటుల వల్ల తమ ప్రాణాలను కోల్పోతున్నారు. అంతేకాదు కొందరి నిర్లక్ష్యంతో ఎదుటి వారికి కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.జీవితంలో ఏది సాధించాలన్నా ముందు మనం బతికి ఉండాలి. మద్యం తాగి వాహనం నడపడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, హెల్మెట్ ధరించకపోవడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు, ట్రాఫిక్ నియమాలను సక్రమంగా పాటించి క్షేమంగా ఇంటికి చేరుకోవాలి,ఆదివారం ములుగు జిల్లా మేడారం జంగాలపల్లిలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతకు సంబంధించి వానదారులు తీసుకోవాల్సిన  జాగ్రత్తలపై నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు